Thursday, November 29, 2007

సరికొత్త విధానాలకు లోక్ సత్తా శ్రీకారం

ప్రపంచంలోనే తొలిసారిగా రాజకీయాల్లో సరికొత్త విధానానికి లోక్ సత్తా పార్తీ పునాది వేసింది. అభ్యర్ధుల ఎంపిక, నిధుల సేకరణ, ఖర్చు, బహిరంగ చర్చల్లో పాటిస్తున్న ప్రమాణాలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలను పర్యవేక్షించేందుకు అంబుడ్స్ మెంట్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్ప రెడ్డితో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ విశిష్ట న్యాయమూర్తిని కమిటీ సభ్యులుగా నియమించనున్నట్టు ఆ పార్టీ వ్యవస్ధాపకుడు తెలిపారు.

రాజకీయాల్లోకి పవన్?


సినీ నటుడు పవన్ కళ్యాణ్ బహుజన సమాజ్ (బియస్పీ)లో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమతో పవన్ కళ్యాణ్ చర్చిస్తున్న మాట వాస్తవమేనని బియస్పీ వర్గాలు చెప్పినట్లు ఒక తెలుగు వార పత్రిక రాసింది. చిరంజీవి సొంత రాజకీయ పార్టీని పెట్టి బియస్పీతో పొత్తు పెట్టుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి నుంచి తగిన స్పందన లేకపోవడంతో తన కొంత మంది సన్నిహితులతో కలిసి పవన్ బియస్పీలో చేరనున్నట్లు ఆ పత్రిక రాసింది. మాజీ కేంద్ర మంత్రి పి.శివశంకర్, మాజీ పార్లమెంటు సభ్యుడు ఎం. పద్మనాభం, మాజీ రాష్ట్ర మంత్రి డి.కె. సమరసింహారెడ్డి వంటివారిని బియస్పీ నాయకత్వం తన పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ ఆ మధ్య పవన్ కళ్యాణ్ ను కలవడంలోని ఆంతర్యం కూడా ఇదేనని అంటున్నారు. చిరంజీవి ప్రమేయం లేకుండా పవణ్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయం తీసుకుంటారని అనుకోలేం.

విదేశాల్లో మృత్యువుతో పోరాడుతున్న భారత విద్యార్ధి






ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన భారతీయ విద్యార్ధి సురేష్ దురదృష్టవశాత్తూ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో కోమాలోకి వెళ్ళి మృత్యువుతో పోరాడుతున్నాడు. సురేష్ కు ఎటువంటి వైద్య భీమా లేకపోవడం వల్ల... వైద్య ఖర్చులు అధికంగా ఉండటంతో సురేష్ కు చికిత్స చేయడానికి ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి. సురేష్ ను డిశ్చార్జి చేస్తామంటు ఆస్పత్రి వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. అయితే ఈ భారతీయ విద్యార్ధి సురేష్ ను ఆదుకునేందుకు దయా హృదయులు ఆపన్నహస్తం అందించాలని(తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) "తామా" కోరుతుంది. సురేష్ ఈస్ట్రన్ ఇల్లెనొయిస్ విశ్వ విద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. సురేష్ ను కాపాడేందుకు (తామా) ఆధ్వర్యంలో దాతల నుంచి సహాయ సేకరణ చేపడుతున్నారు. సురేష్ జీవితాన్ని నిలబెట్టడానికి దాతలు సహాయం అందించాల్సిందిగా "తామా" కోరుతోంది. దాతలు సహాయం చేయడానికి ఈ క్రింది ఫోన్ నెంబర్లుకు ఫోన్ చేయవచ్చు. రమేశ్ పెంచల: 404-422-4583 శ్రీనివాస రెడ్డి: 614-735-8472 మహీందర్ కనపర్తి: 299-289-0176 రోహిత్ మునగాళ్ల: 217-819-8298 శ్రీధర్ రెడ్డి: 903-366-1317 మరిన్ని వివరాలకు ఈ క్రింది వెబ్ సైట్లో చూడవచ్చు http://www.help-suresh.org