
సినీ నటుడు పవన్ కళ్యాణ్ బహుజన సమాజ్ (బియస్పీ)లో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమతో పవన్ కళ్యాణ్ చర్చిస్తున్న మాట వాస్తవమేనని బియస్పీ వర్గాలు చెప్పినట్లు ఒక తెలుగు వార పత్రిక రాసింది. చిరంజీవి సొంత రాజకీయ పార్టీని పెట్టి బియస్పీతో పొత్తు పెట్టుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి నుంచి తగిన స్పందన లేకపోవడంతో తన కొంత మంది సన్నిహితులతో కలిసి పవన్ బియస్పీలో చేరనున్నట్లు ఆ పత్రిక రాసింది. మాజీ కేంద్ర మంత్రి పి.శివశంకర్, మాజీ పార్లమెంటు సభ్యుడు ఎం. పద్మనాభం, మాజీ రాష్ట్ర మంత్రి డి.కె. సమరసింహారెడ్డి వంటివారిని బియస్పీ నాయకత్వం తన పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ ఆ మధ్య పవన్ కళ్యాణ్ ను కలవడంలోని ఆంతర్యం కూడా ఇదేనని అంటున్నారు. చిరంజీవి ప్రమేయం లేకుండా పవణ్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయం తీసుకుంటారని అనుకోలేం.
No comments:
Post a Comment