Friday, August 10, 2007

ఎట్టకేలకు పట్టుబడిన పటోళ్ల

అనేక హత్యకేసులతో సంబంధమున్న పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు అనుచరుడు విష్ణును కూడా అరెస్ట్ చేశారు. పటోళ్లను పట్టుకొవడానికి చాలా కాలం నుంచి ఇటు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 1990లో విప్లవ దేశభక్త పులులు(ఆర్.పీ.టీ) పేరుతో పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ఓ ముఠాను ఏర్పాటు చేసి కళ్లు దుకాణాలు, సిండికెట్ల వద్ద వసూళ్లతో నేర ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఇవే కాకుండా అనేక కిడ్నాప్ కేసులతోనూ బెదిరింపు కెసులతోనూ అతనికి సంబంధంవుంది. 2006 జూన్ లో దిల్ షుఖ్ నగర్ విశ్వం స్కూల్ యజమాని, రియల్టర్ నాగేశ్వరావు హత్య, మలక్ పేట్ పరిధిలో జరిగిన పార్శిల్ బాంబ్ పేలుడు వంటి సంఘటనలతో పటోళ్లకు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అర్నెళ్ల క్రితం అరెస్టయిన పటోళ్ల అనుచరుల సహాయంతో అతన్ని పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు.

No comments: